సజ్జల బాధ్యతలపై జగన్ కీలక నిర్ణయం, ఇక నుంచి - మార్పులు మొదలు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. తిరిగి పార్టీని బలోపేతం దిశగా మార్పులకు సమాయత్తం అవుతున్నారు. పార్టీలో కీలక వ్యక్తుల బాధ్యతల్లో మార్పులు చేస్తున్నారు. నియోజక వర్గాల వారీగా ఇంఛార్జ్ లు.. పార్టీ జిల్లా నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు కూర్పు కొనసాగుతోంది. ఇక సంక్రాంతి నుంచి తాడేపల్లి కేంద్రంగా జగన్ పూర్తి సమయం పార్టీకే కేటాయించనున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల బాధ్యతల విషయంలో తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. మరి కొన్ని మార్పులకు జగన్ కసరత్తు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల తో పాటుగా సీఎంఓలో పని చేసిన అధికారుల పైన పలువురు నేతలు విమర్శలు చేసారు. వారి తీరును తప్పు బట్టారు. తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వారు సైతం జగన్ భజన చేసే వారి కంటే పార్టీకి మేలు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ సూచన చేసారు.

సజ్జల రామక్రిష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. సాక్షి వ్యవహారాల నుంచి పార్టీ లో బాధ్యతల వరకు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడూ అదే విధంగా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, జగన్ తాజాగా పార్టీలో కీలక మార్పుల కు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించారు. ఇప్పుడు భార్గవ రెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భార్గవ్ పైన వచ్చిన ఆరోపణలు.. పార్టీలోని కొందరు నేతలు చేసిన ఫిర్యాదుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి సాక్షి బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అయితే, కొందరు ఇది ప్రమోషన్ గా చెబుతుంటే.. పార్టీలో నేతలు మాత్రం ప్రక్షాళన లో భాగంగా తీసుకున్న నిర్ణయంగా విశ్లేషణలు చేస్తున్నారు. అదే విధంగా పార్టీలో జగన్ కోర్ టీంగా ఉన్న వారి బాధ్యతల్లోనూ త్వరలో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో, జగన్ నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.
-
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!











Click it and Unblock the Notifications