పొత్తులపై దాడి వీరభద్ర రావు సంచలనం: జగన్ క్లాస్?
హైదరాబాద్: పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. పొత్తు అంశంపై దాడి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జగన్ ఆయనకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మిగిలిన పార్టీ నేతలను కూడా పొత్తు విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడవద్దని ఆదేశించారట.

దాడి నిన్న మాట్లాడుతూ.. రాబోయే కాలంలో యూపిఏకు మద్దతిస్తామని కడప ఉప ఎన్నికల సమయంలో వైయస్ జగన్ చెప్పారని, అప్పుడు ఆయన అరెస్టు కాలేదని, కాంగ్రెసు కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారని అన్నారు. అయితే జగన్ మద్దతిస్తామని చెప్పినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమించకుండా జగన్ను జైలులో పెట్టించిందని ఆరోపించారు. జైలుకు వెళ్లకముందు చెప్పిన మాటలకు మనుగడ లేదని, కాంగ్రెసుకు మద్దతివ్వమని దాడి చెప్పారు.
అయితే జైల్లో పెట్టారు కాబట్టి మాట మారుస్తున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే... ఊహాజనితాల సమాధానాలు చెప్పలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారన్నారు.
దాడి పై వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో జగన్ ఆయనను మందలించినట్లుగా తెలుస్తోంది. టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఈ అంశంపై స్పందించారు. సోనియాను ఏమైనా అంటే జగన్ సహించరని, దాడిని మందలించడమే అందుకు నిదర్శనమని విజయవాడలో చెప్పారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications