ఎన్నికలు: టిడిపిపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు(పిక్చర్స్)
హైదరాబాద్: మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అధికారదుర్వినియోగానికి పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగన్ సోమవారం పార్టీ ముఖ్య నాయకుల తోపాటు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ నరసింహన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు లేఖ అందజేశారు.
జులై 3,4,5 తేదీల్లో జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని గవర్నర్ నరసింహన్కు జగన్ తెలిపారు. టిడిపి దురాగతాలను చూసి ప్రజలు విస్తుపోయారని, అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఉందా?, ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు.
టిడిపి సృష్టించిన భయానక వాతావారణం గురించి, దాడుల గురించి రిటర్నింగ్ అధికారులైన జిల్లా కలెక్టర్ల దృష్టికి తాము, ఇతర ప్రజా సంఘాలు తీసుకెళ్ళినా స్పందించలేదని, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ..
మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అధికారదుర్వినియోగానికి పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.

గవర్నర్కు ఫిర్యాదు
ఈ మేరకు జగన్ సోమవారం పార్టీ ముఖ్య నాయకుల తోపాటు రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ నరసింహన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు లేఖ అందజేశారు.

గవర్నర్కు ఫిర్యాదు
జులై 3,4,5 తేదీల్లో జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని గవర్నర్ నరసింహన్కు జగన్ తెలిపారు.

టిడిపై ఫిర్యాదు
టిడిపి దురాగతాలను చూసి ప్రజలు విస్తుపోయారని, అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఉందా?, ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications