ఆరుగురు ఎమ్మెల్సీల ఏకగ్రీవం: రామచంద్రయ్య, దువ్వాడ సహా వీరే, మండలిలో పెరిగిన వైసీపీ బలం
అమరావతి: ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహమ్మద్ ఇక్బాల్, చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నీసా నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా మరే ఇతర నామినేషన్లు దాకలు కాకపోవడంతో వారంతీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

అసెంబ్లీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డికి ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందజేశారు.
తాజాగా, కొత్తగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలో శాసనమండలిలో చేరడంతో వైసీపీ బలం కూడా పెరిగినట్లయింది. ప్రస్తుతం ఈ ఆరుగురితో మండలిలో వైసీపీ బలం 18కి చేరింది. దీంతో మండలిలో కూడా టీడీపీ మరింత బలంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీడీపీ సభ్యుల బలం 26గా ఉంది. పీడీఎఫ్కు చెందిన ఐదుగురు, బీజేపీకి చెందిన ముగ్గురు, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. మరో మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications