బాబుకు తప్పు తెలిసింది, టీలో ఎందుకు: జగన్ పార్టీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసినందుకే ప్రభుత్వం రాజధాని భూముల్లో రెండో పంట సాగుకు అనుమతి ఇచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బుధవారం అన్నారు. రాజధాని భూముల్లో రెండో పంట సాగు పైన ప్రభుత్వం వెనుకడుగు అందరి విజయమని చెప్పారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకొని రాజధానికి భూములిచ్చిన రైతులకు కూడా రెండో పంట వేసుకునే అవకాశం కల్పించారన్నారు. చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చి ఎక్కడికైనా తిరగవచ్చునని చెప్పారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు మాత్రం పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో పర్యటించడం ఎంత వరకు సమంజసమన్నారు.

విభజన హామీలు అమలు చేస్తాం: హరిబాబు
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని విశాఖ ఎంపీ హరిబాబు వెల్లడించారు. కాంగ్రెస్ పదేళ్లు ఉండి ఏం చేయలేదదని, కాని గత 8నెలల్లో కేంద్రం ఆంధ్రాకు ఎన్నో నిఽధలిచ్చిందన్నారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం, రాష్ట్రం ఒకటే మాటపై ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications