గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం; ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, మరియు సంక్షేమ మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటికి వెళ్లిన వైసీపీ నేతలు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సమయంలో వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అనేక చోట్ల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక తాజాగా గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కు నిరసన సెగ తగిలింది. దీంతో ఆగ్రహించిన ముస్తఫా ప్రజలకు శాపనార్థాలు పెట్టారు. ఇంతకు ఏం జరిగిందంటే.

నేడు గుంటూరులోని 9 వ డివిజన్ లో మురుగుకాల్వల శంకుస్థాపనకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా వెళ్లారు. 9 వ డివిజన్ లో సైడ్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ముస్తఫాను అడ్డుకున్న మహిళలు తమ డివిజన్లో బాగున్న సైడ్ కాలవలు పగలగొట్టి, కొత్త కాల్వల నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
కాలువలు పగులగొట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. బాగున్న వాటికి నిధులు దుర్వినియోగం చేయకుండా వేరేచోట వాడుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా కు సూచించారు. స్థానిక కార్పొరేటర్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ నేతలకు తెలిపారు. ఈ క్రమంలో తనను వ్యతిరేకించి, కార్యక్రమాన్ని అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు ఎమ్మెల్యేకు నిరసన సెగ..శాపనార్థాలు పెట్టిన ముస్తాఫా..!!#MohammadMusthafaShaik #YSRCPMLA #AndhraPradesh #YSRCP #AndhraNews #ApPolitics #Oneindiatelugu pic.twitter.com/uqNTp5FlAk
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2023
డివిజన్ ప్రజలు నాశనం కావాలంటూ శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే శాపనార్ధాలపై డివిజన్ ప్రజలు మండిపడ్డారు. తాము చెప్పింది మంచి విషయమేనని, బాగున్న సైడ్ కాలవలు ఎందుకు తొలగించటం అని వారు పేర్కొన్నారు. ముస్తఫా తక్షణమే క్షమాపణ చెప్పాలని స్థానిక ప్రజలతో పాటు, పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications