టీడీపీ, వైసీపీ సవాళ్లతో వేడెక్కిన విశాఖ- ఎమ్మెల్యే వెలగపూడి ఇంటికి భారీ భద్రత
దివంతగత నేత వంగవీటి మోహనరంగా హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్దం విశాఖ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. రంగా హత్య నిందితుడంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై మాటల యుద్ధం ప్రారంభించిన వైసీపీ, అనంతరం ఆయన రౌడీయిజం చేశారని, కబ్జాలు చేశారని వరుస ఆరోపణలు చేస్తోంది. దీంతో ఆయన సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
తనపై చేసిన ఆరోపణలు నిజమని వైసీపీ నేతలు సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ విసిరిన సవాల్ కు అధికార పార్టీ స్పందించింది. తమ ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని విశాఖ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ విజయనిర్మల ప్రకటించారు. దీంతో వెలగపూడి సవాల్ను వైసీపీ స్వీకరించినట్లయింది. సవాల్కు సిద్ధపడి ఎమ్మెల్యే రామకృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయిబాబా గుడికి వస్తారన్న సమాచారంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

అలాగే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగొచ్చనే సమాచారంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రత పెంచారు. సాధారణంగా ఎమ్మెల్యే ఇంటికి కల్పించే భద్రతకు అదనంగా మరికొందరు పోలీసులను పంపారు. అసలే ఇవాళ రంగా వర్దంతి కూడా కావడంతో ఈ సాకుతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసనకు దిగే అవకాశం కూడా ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంటోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications