భార్యను చంపేశాడు. చివరి నిమిషంలో మనసు మార్చుకున్న భర్త, వీడు కేటుగాడు!
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులతో విసిగి వేసారిపోయిన పానీపూరీ వ్యాపారి భార్యను హత్య చేసి ఆత్మహత్యకు ప్రయత్నించి చివరకు ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుని వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది. బెంగళూరులోని మారతహళ్లి సమీపంలోని కుందలహళ్లిలో నివాసం ఉంటున్న సరిత (35) హత్యకు గురైన గృహిణి. ఈ హత్య అనంతరం మృతురాలి భర్త తారానాథ్ పోలీసులకు లొంగిపోయాడు.
ఆర్థిక ఇబ్బందులతో విసుగు చెందిన తారానాథ్ భార్య సరితను హత్య చేసి తరువాత అతను ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే చివరి క్షణంలో నిందితుడు తారానాథ్ ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుని కూల్ గా వచ్చి లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. మంగళూరుకు చెందిన తారానాథ్, సరిత 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని తరువాత బెంగళూరులోని కుందలహళ్లికి చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

కానీ దంపతులకు పిల్లలు లేరు. పానీపూరీ దుకాణం ఉన్న తారానాథ్ తన స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. 11 లక్షల రుణం ఉంది. అయితే ఈ రుణం తారానాథ్ దేని కోసం చేశారో తెలియలేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో రుణదాతల పోరు మొదలైంది. ఈ విషయమై తారానాథ్, సరిత దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.
ఆర్థిక సమస్యలు, భార్య గొడవలతో రెచ్చిపోయిన తారానాథ్ తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతే తన భార్య సరిత అనాథ అవుతుందని ఆందోళన చెందాడు. భార్య సరితను హత్య చేసి ఆత్మహత్య చేసుకోవాలని తారానాథ్ నిర్ణయించుకున్నాడు. రాత్రి భార్యను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన తారానాథ్ మంగళూరు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అయితే చివరి క్షణంలో ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుని మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటి యజమానులకు ఫోన్ చేసి సరిత హత్య విషయం చెప్పాడు. అనంతరం బెంగళూరు వచ్చిన తారానాథ్ ఇంటి యజమానితో కలిసి హత్య గురించి చెప్పాడు. మరుసటి రోజు తారానాథ్ తన ఇంటి యజమానులతో కలిసి వైట్ ఫీల్డ్ పోలీసులకు లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications