స్టాక్ మార్కెట్లో అతిపెద్ద తప్పు ఇదే: ఎలన్ మస్క్ పెట్టుబడి సూత్రం ఏంటి?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పెట్టుబడిదారులకు కీలక సలహాలు ఇచ్చారు. ఇటీవల నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ 'పీపుల్ బై WTF'లో పాల్గొన్న సందర్భంగా.. ఎలన్ మస్క్ను రెండు కీలకమైన ప్రశ్నలు అడిగారు. పెట్టుబడిదారులకు మీరేం సలహా ఇస్తారు? ఒక సాధారణ పెట్టుబడిదారుగా మీరు ఏ రంగంలో డబ్బు పెడతారు?.. అని అడిగిన ఈ రెండు ప్రశ్నలకు చాలా సరళమైన, కానీ లోతైన సమాధానాలు ఇచ్చారు.
స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పొరపాటు ఏమిటి?
స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటనే ప్రశ్నకు మస్క్ ఇలా బదులిచ్చారు. "ప్రజలు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, వారు మార్కెట్లో రోజువారీగా వచ్చే 'శబ్దానికి' భయపడి ఆందోళన చెందుతారు. షేర్ ధర ఈ రోజు పెరిగిందా, రేపు తగ్గిందా అని చూస్తారు. కానీ వాస్తవానికి పెట్టుబడి అనేది ఎల్లప్పుడూ సుదీర్ఘ ప్రయాణం, ఇది దీర్ఘకాలిక ఆట." అని మస్క్ చెప్పారు.

మస్క్ పెట్టుబడి పెట్టడానికి అనుసరించే సూత్రం చాలా సూటిగా ఉంటుందని ఆయన ఇలా అన్నారు. "మీకు ఆ కంపెనీ ఉత్పత్తులు నిజంగా నచ్చితేనే, దాని స్టాక్లో డబ్బు పెట్టండి." ఆ కంపెనీ తయారుచేసే వస్తువులను మీరు స్వయంగా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారా? రాబోయే కాలంలో కూడా ఆ కంపెనీ ప్రజల జీవితాలను మెరుగుపరిచే సేవలు లేదా వస్తువులను అందిస్తుందని మీరు భావిస్తున్నారా అని ఆలోచించాలన్నారు. కంపెనీ అనేది కాగితాలు లేదా భవనాలతో ఏర్పడదు, అది మనుషుల సమూహంతో ఏర్పడుతుంది. "ఆ కంపెనీలోని వ్యక్తులు కష్టపడతారా? వారిలో ప్రతిభ ఉందా? వారు దీర్ఘకాలం పాటు నిలబడగలిగే శక్తి, సామర్థ్యం వారిలో ఉందా?" అని చూడాలన్నారు. షేర్ ధరలో రోజువారీ హెచ్చుతగ్గులు తరచుగా ప్రజల భావోద్వేగాలు, చిన్న వార్తల వల్ల వస్తాయి. దీనికి కంపెనీ నిజమైన నాణ్యతతో సంబంధం ఉండదు. బలమైన పునాది (బెస్ట్ ప్రొడక్ట్స్, మంచి టీమ్) ఉన్న కంపెనీలే దీర్ఘకాలంలో విజయం సాధిస్తాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
ఎలన్ మస్క్ ఏ రంగంలో పెట్టుబడి పెడతారు?
"మీరు ఒక సాధారణ పెట్టుబడిదారు అయితే, ఈ రోజు ఏ రంగంలో డబ్బు పెడతారు?" అనే ప్రశ్నకు మస్క్ ఇచ్చిన సమాధానం భవిష్యత్తు అవకాశాలపై ఆధారపడి ఉంది. మస్క్ సాంప్రదాయ పెట్టుబడిదారుని కాదని, ఆయన కంపెనీలను సృష్టిస్తారని చెప్పారు. అందుకే ఆయన దృష్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపగల రంగాలపై ఉంది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుందని మస్క్ అన్నారు. ఉదాహరణకు గూగుల్ వంటి కంపెనీలు భారీ డేటా కారణంగా ముందంజలో ఉన్నాయి. ఏఐ, రోబోటిక్స్ రెండూ కలిసి వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని 10 రెట్లు లేదా 100 రెట్లు పెంచగలవు.ఏఐ విప్లవానికి కీలకమైన GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) సరఫరా చేసే Nvidia వంటి కంపెనీలు ఈ రంగంలో చాలా ముఖ్యమైనవి. అంతరిక్ష సాంకేతికతపై కూడా మస్క్ దృష్టి పెట్టారు. మస్క్ అభిప్రాయం ప్రకారం, రాబోయే కొన్ని దశాబ్దాలలో ఏఐ, రోబోటిక్స్ నుంచే అతిపెద్ద సంపద సృష్టించబడుతుంది. అందుకే, ఈ రంగాలను గుర్తించి పెట్టుబడి పెట్టాలి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications