ఏటీఎం యూజర్లకు RBI గుడ్ న్యూస్.. !!
నగదు లావాదేవీల్లో చిల్లర నోట్ల కొరత సమస్య దీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తోంది. నోట్ల రద్దు జరిగి దశాబ్దం కావస్తున్నా ఈ పరిస్థితి మారట్లేదు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత ఇక చిన్న నోట్లు, కాయిన్ల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరం లేకపోయినా, చిల్లర కోసం ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని జనం ఎదుర్కొంటోన్నారు. ఇటువంటి పరిస్థితికి చెక్ పడబోతోంది త్వరలో. డిజిటల్ పేమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. రోజువారీ క్రయ విక్రయాల్లో చిల్లర కొరత తప్పట్లేదు.
దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా రూ. 10, రూ. 20, రూ. 50 విలువ గల నోట్లను డిమాండ్ను బట్టి అందించడానికి కరెన్సీ డిస్పెన్సింగ్ మెషీన్లు, నాణేలను అందించడానికి 'హైబ్రిడ్ ఏటీఎంలు' ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ముంబైలో పైలెట్ ప్రాజెక్ట్ దీన్ని చేపట్టింది. చిన్న విలువ నోట్లను ఎక్కువగా ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ను కేంద్రం ఇదివరకే ఆదేశించింది.

దేశవ్యాప్తంగా రూ. 10 నుంచి 50 రూపాయల వరకు చిన్న డినామినేషన్ నోట్లను అందించే హైబ్రిడ్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నట్లు అటు రిజర్వ్ బ్యాంక్ కూడా సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ హైబ్రిడ్ ఏటీఎంలను మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అధిక నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ఇది చిన్న మొత్తాల నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని ది మింట్ తెలిపింది.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో లక్షలాది మంది రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు నగదుపైనే ఆధారపడుతున్నారు. వారికి 10, 20, 50 రూపాయల చిల్లర దొరకకపోవడం జీవనోపాధికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ ఏటీఎంలను ప్లాన్ చేసింది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు ద్వారా హైబ్రిడ్ ఏటీఎంల పనితీరును పరీక్షిస్తోన్నారు రిజర్వ్ బ్యాంక్ అధికారులు. ఇది సక్సెస్ కావడంతో రిజర్వ్ బ్యాంక్ చిన్న నోట్ల ముద్రణను పెంచాలని యోచిస్తోంది. తద్వారా ఏటీఎంలల్లో నగదు కొరత ఉండదు.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం- చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 500 నోట్లు పరిమాణం (వాల్యూమ్) పరంగా 41.2 శాతం ఉంటోంది. విలువ (వాల్యూ) పరంగా కూడా దీనిదే ఆధిపత్యం. 86 శాతం 500 రూపాయల నోట్లు మార్కెట్ లో చలామణిలో ఉంటోన్నాయి. చిన్న నోట్ల పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. మార్కెట్ లో అందుబాటులో ఉంటోన్న చిన్న విలువ నోట్లు.. అంటే రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50 మొత్తం కలిపి మొత్తం కరెన్సీ పరిమాణంలో సుమారు 38 శాతం. వాటి మారకం విలువ 3.1 శాతం మాత్రమే.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications