షాక్: ఇన్సోసిస్కు రాజేష్ మూర్తి రాజీనామా
న్యూఢిల్లీ: ఇన్పోసిస్లో పరిస్థితులు చక్కబడుతాయని భావిస్తున్న తరుణంలో మరో షాక్ తగిలింది. ఇన్పోసిస్ దిగ్గజాల్లో ఒకరైన రాజేష్మూర్తి కంపెనీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ పరిణామం టెక్ కంపెనీలో ఇంకా సంక్షోభం ముగిసిపోలేదని తేటతెల్లం చేసింది. అయితే కొత్త సీఈఓగా సలీల్ ఫరేఖ్ బాధ్యతలను స్వీకరించారు.
ఇన్ఫోసిస్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సలీల్ పరేఖ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఈయనే. పరేఖ్ రాకతో మేనేజ్మెంట్లో రాజీనామాల పర్వం తగ్గుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ కంపెనీలో రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.

అయితే మూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఇన్ఫోసిస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. 26 ఏళ్లుగా ఆయన ఇన్ఫీలో పనిచేస్తున్నారు. జనవరి చివరి వరకు మాత్రమే మూర్తి ఇక ఇన్ఫీలో పనిచేయనున్నారు.
గత 26 ఏళ్లుగా ఇన్ఫోసిస్ అందించిన సేవలకు గాను, కంపెనీ ఆయనను ప్రశంసించింది. భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. గత జూన్లో నలుగురు ఇన్ఫోసిస్ అధినేతల్లో ఒకరైన సందీప్ దాడ్లాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆయన అనంతరం ప్రస్తుతం మూర్తి కూడా కంపెనీ నుంచి తప్పుకోబోతున్నట్టు తెలిపారు. 2016లో మూర్తి కంపెనీ అధినేతగా ప్రమోట్ అయ్యారు. ఎనర్జీ, యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్, సర్వీసెస్కు మూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications