love story: వీడే పిల్లనాయాలు, వీడికి మళ్లీ ఓ బుడ్డోడా ? ఆడుకోమంటే అమ్మానాన్న ఆట ఆడేశాడు!
చెన్నై/ మదురై/ విల్లుపురం: అమ్మాయిది ఆడుకునే వయసు. అబ్బాయి ఇంచు మించు అలాంటి వయసే. అయితే వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ తో ఆడుకొకుండా వాళ్లిద్దరే అమ్మానాన్న ఆట ఆడుకున్నారు. ఆట వర్కట్ కావడంతో అమ్మాయి గర్బవతి అయ్యింది. ఉద్యోగం చెయ్యడానికి వేరే ఊరికి వెళ్లిన అబ్బాయి తన ప్రియురాలు 7 నెలల గర్బవతి అని తెలుసుకుని షాక్ అయ్యాడు. నువ్వు ఎవరితోనో తిరిగి ఆ బిడ్డకు నేను తండ్రి అని చెప్పమంటే ఎలా అంటూ రెచ్చిపోయాడు. బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసు కేసు పెట్టింది. ఈ లవ్ స్టోరీలో అమ్మాయికి 15 ఏళ్లు, అబ్బాయికి 17 ఏళ్లు అని తెలుసుకుని బిత్తరపోయిన పోలీసులు న్యాయనిపుణులను ఆశ్రయించారు. వీడే పిల్లనాయాలు వీడికి మళ్లీ ఓ బుడ్డోడా ? అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు.

అమ్మాయి @ 15 అబ్బాయి @ 17
తమిళనాడులో చాలాచాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని వినడానికి వింతగానే ఉన్నా అవి జగమెరిగిన సత్యాలు అని వెలుగు చూస్తున్నాయి. తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా బి. కుమారలింగపురం ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఇదే జిల్లాలోని కరుప్పస్వామి పట్టణంలో 17 ఏళ్ల అబ్బాయి నివాసం ఉంటున్నాడు.

సినిమా లెవల్లో టచ్
అనుకోకుండా తమిళ సినిమా స్టైల్లో అమ్మాయి, అబ్బాయి ఆకస్మికంగా కలుసుకున్నారు. తరువాత ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ టైమ్ చిక్కినప్పుడు కలుసుకుని ఎంజాయ్ చేశారు. మా అమ్మాయి ఆడుకోవడానికి వెలుతోందని అమ్మాయి తల్లిదండ్రులు అనుకున్నారు.

అమ్మానాన్న ఆట తప్పు
తమ కుమార్తె అబ్బాయితో అమ్మానాన్న ఆట ఆడుకోవడానికి వెలుతున్నదని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మండిపడ్డారు. నీకు వయసు చాలా తక్కువ, ఇలాంటి వయసులో నువ్వు చేస్తున్నది తప్పు అంటూ అమ్మాయికి ఆమె తల్లి నచ్చచెప్పింది. అయితే ఇలాంటివి అన్నీ రోటీన్ గా జరుగుతుంటాయని, నువ్వు ఏమి పట్టించుకోవద్దని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి ఆమె ప్రియుడు మాయమాటలు చెప్పాడు.

ప్రియుడి మీద కిడ్నాప్ కేసు
బాలికను ఆమె తల్లిదండ్రులు బయటకు రాకుండా చేశారు. ఇదే సమయంలో అబ్బాయి తన ప్రియురాలిని పిలుచుకుని విరూద్ నగర్ వెళ్లి కోట్టాయం ప్రాంతంలో ఓ అద్దె ఇంటిని తీసుకుని అక్కడ ఏకంగా కాపురం పెట్టేశాడు. బాలిక కనపడటం లేదని ఆమె తల్లిదండ్రులు ప్రియుడి మీద కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే అమ్మాయి, అబ్బాయి మాత్రం కోట్టాయం ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు.

ఉద్యోగం కోసం వెళ్లి మాయం
మూడు నెలల క్రితం కోట్టాయంలోని ఇంటిలో ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు తాను ఉద్యోగం కోసం వెలుతున్నానని చెప్పి తిరుపూర్ వెళ్లిపోయాడు. తరువాత ప్రియుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మూడు నెలలు అయినా ప్రియుడి ఆచూకిలేకపోవడంతో ఆందోళన చెందిన ప్రియురాలు తిరుపూర్ వెళ్లి ప్రియుడి కోసం గాలించి చివరికి అతన్ని పట్టుకుంది. తాను ఇప్పుడు 7 నెలల గర్బవతి, నన్ను వదిలేసి వచ్చేస్తే ఎలా ? అంటూ ప్రియురాలు గొడవపెట్టుకుంది.

నాకేం సంబంధం చెప్పు ?
నేను ఇంటి నుంచి వచ్చేసి మూడు నెలలకు పైగా అయిపోయింది, నువ్వు గర్బవతి అని వచ్చి చెబితే నాకేం సంబంధం చెప్పు ? ఎవరో బిడ్డకు నేను తండ్రి అని చెప్పమంటే ఎలా ? అంటూ ప్రియుడు ఎదురుతిరిగాడు. ప్రియుడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విసిగిపోయిన ప్రియురాలు విరూద్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అప్పటికే అమ్మాయి కనపడలేదని కిడ్నాప్ కేసు నమోదు కావడం, ఇప్పుడు ఆమె గర్బవతి అని తెలియడంతో పోలీసులు బిత్తరపోయారు. అమ్మాయికి 15 ఏళ్ల, అబ్బాయికి 17 ఏళ్లు అని తెలుసుకున్న పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, అమ్మాయిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని విరూద్ నగర్ పోలీసులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications