Wife: కూతుర్లకు పెళ్లి అయ్యింది, ఓ విషయంలో భర్తతో గొడవలు, కొబ్బరి తోటలో శవమైన లేడీ, మ్యాటర్!
చెన్నై/తంజావూర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతుల ఇద్దరు పిల్లలకు వివాహం జరిగిపోయి వాళ్లు వేరుగా నివాసం ఉంటున్నారు. వ్యవసాయం చేయిస్తున్న భర్త అతని భార్యను ఇంతకాలం బాగా చూసుకున్నాడు. ఓ విషయంలో చాలాకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుని పిల్లలు వేరుగా కాపురం ఉంటున్న సమయంలో మీ గొడవలు ఏమిటి అంటూ బందువులు కొంతకాలం నుంచి దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వస్తున్నారు. ఎవరు ఎంత చెప్పినా దంపతుల మద్య గొడవలు మాత్రం అలాగే జరుగుతున్నాయి.
ఊర్లో గొర్రెలు మేపుతున్న మహిళ గ్రామం శివార్లోని ఓ కొబ్బరి తోటలోకి వెళ్లింది. అక్కడ మహిళను పాతిపెట్టారని, చెయ్యి బయటకు వచ్చిందని గుర్తించిన మహిళ హడలిపోయి ఊర్లో వాళ్లకు విషయం చెప్పింది. ఊర్లో వాళ్లకు విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గోతి తీసి మహిళ శవం బయటకు తీశారు. కొంతకాలంగా భర్తతో గొడవలు పడుతున్న మహిళ శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. రెండు వారాల క్రితం భర్తతో గొడవపడి వెళ్లి పోయిన మహిళ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు.
Illegal affair: ప్రియురాలితో జల్సాలు, కారం పొడి చల్లి, రోకలితో లేపేసిన భార్య, డోంట్ కేర్!
పిల్లలకు పెళ్లిళ్లు జరిగిపోయాయి
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని పట్టుకోటై సమీపంలోని తిట్టుక్కుడిలో ఇళంగోవన్, అన్నపూర్ణ (52) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇళంగోవన్ వివాహం చేసుకున్న అన్నపూర్ణ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతుల ఇద్దరు పిల్లలకు వివాహం జరిగిపోయి వాళ్లు వేరుగా నివాసం ఉంటున్నారు.
ఓ విషయంలో గొడవలు
వ్యవసాయం చేయిస్తున్న ఇళంగోవన్ అతని భార్య అన్నపూర్ణను ఇంతకాలం బాగా చూసుకున్నాడు. ఓ విషయంలో చాలాకాలంగా ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుని పిల్లలు వేరుగా కాపురం ఉంటున్న సమయంలో మీ గొడవలు ఏమిటి అంటూ బందువులు కొంతకాలం నుంచి ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వస్తున్నారు.
మ్యాటర్ మాత్రం అలాగే ఉంది
ఎవరు ఎంత చెప్పినా ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతుల మద్య గొడవలు మాత్రం అలాగే జరుగుతున్నాయి. రెండు వారాల క్రితం ఇంట్లో భర్త ఇళంగోవన్ తో గొడవపడిన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన భార్య అన్నపూర్ణ పుట్టింటికి వెళ్లి ఉంటుందని అనుకున్న ఇళంగోవన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇంటికి రాని అంటూ సైలెంట్ గా ఉండిపోయాడని తెలిసింది.
కొబ్బరితోటలో మహిళ శవం
ఊర్లో గొర్రెలు మేపుతున్న మహిళ సాయంత్రం గ్రామం శివార్లోని ఓ కొబ్బరి తోటలోకి వెళ్లింది. అక్కడ మహిళను పాతిపెట్టారని, చెయ్యి బయటకు వచ్చిందని గుర్తించిన మహిళ హడలిపోయి ఊర్లో వాళ్లకు విషయం చెప్పింది. ఊర్లో వాళ్ల హడలిపోయి ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్దరాత్రి గోతి తీసి మహిళ శవం బయటకు తీశారు.
సైలెంట్ గా ఉండిపోయిన భర్త
కొంతకాలంగా భర్త ఇళంగోవన్ తో గొడవలు పడుతున్న అతని భార్య అన్నపూర్ణ (52) అనే మహిళ కొబ్బరి తోటలో శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. రెండు వారాల క్రితం భర్త ఇళంగోవన్ తో గొడవపడి వెళ్లి పోయిన అన్నపూర్ణ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు. అయితే అన్న పూర్ణ భర్త ఇళంగోవన్ సైలెంట్ గా ఉండిపోయాడని పోలీసులు అంటున్నారు.
Recommended Video
ఏం జరిగింది?
అన్నపూర్ణను ఆస్తి కోసం హత్య చేశారా ?, అక్రమ సంబంధం కారణంగా హత్య చేశారా ?, నగల కోసం ఎవరైనా చంపేసి శవం పాతిపెట్టారా ? అనే విషయం అర్థం కావడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అన్నారు. వారం రోజుల క్రితం అన్నపూర్ణ హత్యకు గురై ఉంటుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.