రోడ్ టెర్రర్ : లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
రేణిగుంట : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదం నింపింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రేణిగుంట - కడప రహదారి లోని మామండూరు దగ్గర లారీ - కారు ఢీకొన్న ఘటనలో నలుగురు పెద్దలు, ఒక చిన్నారి ప్రాణాలు విడిచారు.
కడప జిల్లా సీకే దిన్నెకు చెందిన గంగాధర్ విదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చేందుకు చెన్నై చేరుకున్నారు. గంగాధర్ ను తమ గ్రామానికి తీసుకొచ్చే క్రమంలో కుటుంబ సభ్యులు కారు తీసుకుని చెన్నైకి బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణంలో కడప నుంచి రేణిగుంట వైపు వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గంగాధర్ తో పాటు ఆయన భార్య, తమ్ముడు, మరదలు, రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications