కలికాలం : హిజ్రాను మనువడిన యువకుడు.. ఎక్కడో తెలుసా..?
చిత్తూరు : అప్పుడెప్పుడో బ్రహ్మంగారూ చెప్పినట్టు అన్నీ నిజమవుతున్నాయి. చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కలికాలం అంటే ఇదేనని స్పష్టమవుతుంది. మానవత్వం మంటగలిసిపోతోంది. మానవ సంబంధాలకు విలువలే లేకుండా పోతున్నాయి. యువతి, యువతి పెళ్లి చేసుకోవడం లాంటి విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి.
చిత్రం .. భళారే చిత్రం
శుక్రవారం రాత్రి తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందు ఒక్కటే సందడి. సాధారణంగా అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. లేదంటే పెళ్లి క్రతువు సందడి ఉంటుంది. అక్కడ జరుగుతుుంది పెళ్లే .. కానీ మమూలు వివాహం కాదు. ఓ అబ్బాయి హిజ్రాను పెళ్లి చేసుకునే వేడుక. ఔను మీరు విన్నది నిజమే. బెంగళూరుకు చెందిన మనోజ్ సబీ అనే హిజ్రాను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. అదేంటో తెలుసా.. పెళ్లి పెద్దలుగా వ్యవహరించింది ఎవరో తెలుసా ..ఇంకేవరో ఆ హిజ్రాల బంధువులు, తోబుట్టులు. మనోజ్ హిజ్రాను పెళ్లి చేసుకోవడాన్ని చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. ఇదేం విచిత్రమో అని భక్తులు ఆశ్చర్యపోయారు.

తిరుచానూరు చిత్రం ఇలా ఉంటే మరోవైపు దామినేడులో మరో విచిత్రం చోటుచేసుకుంది. ఇద్దరూ హిజ్రాలు పెళ్లి చేసుకున్నారు. ఇందిరమ్మ గృహల్లో ఉంటున్న ఇద్దరు .. మనువాడారు. ఇదేమీ విచిత్రమో అని అనుకున్నరంతా. పెళ్ల అంటే దాంపత్య సుఖం మాత్రమే కాదు .. ఒకరికి ఒకరు కష్టం, సుఖంలో తోడుగా ఉండాలనే సందేశం ఇచ్చారు.












Click it and Unblock the Notifications