హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Alai Balai: ఈ నెల 6న అలయ్ బలయ్.. చీఫ్ గెస్ట్‌‌గా మెగాస్టార్ చిరంజీవి అలయ్‌‌ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌‌

|
Google Oneindia TeluguNews

పండుగంటే.. అందరం ఒక చోట కలిసి ఆనందంగా ఉండడం.. యోగక్షేమాలు తెలుసుకోవడం.. ఈ ఉద్దేశంతోనే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొన్ని ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అలయ్ బలయ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఉన్నారు.

ఈ అలయ్ బలయ్ ప్రతీ సంవత్సరం దసరా పండు సందర్భంలో నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ
దసరా తర్వాతి రోజు అంటే ఈ నెల 6న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలయ్‌‌ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌‌ విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని పేర్కొన్నారు.

Alai Balai program will be held on October 6

గత 17 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెప్పారు. చిరంజీవితో పాటు, ఏపీ, హర్యానా, కేరళ గవర్నర్లు, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వస్తారని వెల్లడించారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా పంజాబీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖులకు సన్మానం చేస్తామ నిచెప్పారు.

తెలంగాణకు సంబంధించి అనేక వంటకాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఇప్పటికే ప్రముఖలకు ఆహ్వానాలు లేఖలు అందించామని తెలిపారు.

English summary
Alai Balai Foundation Chairman Vijayalakshmi said that Alai Balai program will be held on October 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X