Alai Balai: ఈ నెల 6న అలయ్ బలయ్.. చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్
పండుగంటే.. అందరం ఒక చోట కలిసి ఆనందంగా ఉండడం.. యోగక్షేమాలు తెలుసుకోవడం.. ఈ ఉద్దేశంతోనే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొన్ని ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అలయ్ బలయ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఉన్నారు.
ఈ
అలయ్
బలయ్
ప్రతీ
సంవత్సరం
దసరా
పండు
సందర్భంలో
నిర్వహిస్తారు.
అందులో
భాగంగా
ఈ
దసరా
తర్వాతి
రోజు
అంటే
ఈ
నెల
6న
అలయ్
బలయ్
కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నామని
అలయ్
బలయ్
ఫౌండేషన్
ఛైర్మన్
విజయలక్ష్మి
చెప్పారు.
ఈ
కార్యక్రమాన్ని
నాంపల్లిలోని
ఎగ్జిబిషన్
గ్రౌండ్లో
నిర్వహిస్తామని
తెలిపారు.
ఈ
కార్యక్రమానికి
చీఫ్
గెస్ట్గా
మెగాస్టార్
చిరంజీవి
హాజరవుతారని
పేర్కొన్నారు.
గత 17 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెప్పారు. చిరంజీవితో పాటు, ఏపీ, హర్యానా, కేరళ గవర్నర్లు, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వస్తారని వెల్లడించారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా పంజాబీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖులకు సన్మానం చేస్తామ నిచెప్పారు.
తెలంగాణకు సంబంధించి అనేక వంటకాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఇప్పటికే ప్రముఖలకు ఆహ్వానాలు లేఖలు అందించామని తెలిపారు.