KCR: తెలంగాణ ముందుకెళ్తుంటే.. దేశం వెనకబడుతుంది: కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంటే దేశం మాత్రం వెనకబడి పోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మన గంగా యమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు సందర్భంగా ఎల్బీ స్టేడియం చుట్టపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications