ప్లీనరీలో తలుక్కుమన్న మున్నూరు రవి.. ఎలా వచ్చాడంటే.. కలకలం
టీఆర్ఎస్ ప్లీనరీలో.. విమర్శలు, కౌంటర్ అటాకే కాదు.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ప్లీనరీలో తలుక్కు మన్నాడు. పార్టీ వేడుకకు హాజరై.. పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.
పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్ ఉన్న పాసులు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుకకు హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మున్నూరు రవికి ఈ పాస్ లేకున్నా అతడు పార్టీ ప్లీనరీకి ఎలా హాజరయ్యాడనే విషయంపై పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు రవి పార్టీ వేడుకకు హాజరయ్యాడని ఆ తర్వాత తెలిసింది.

పార్టీ వేడుకలో అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి ఇంకా అక్కడే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ లీడర్లతో మున్నూరు రవి ఫొటోలు దిగారు. పాస్ లేకుండా ఎలా వచ్చాడనే చర్చతో అక్కడి నుంచి రవి వెంటనే వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మున్నూరు రవి వెంటనే డిలీట్ చేశారు. ఏది ఏమైనా మంత్రి హత్యాయత్నం కేసులో నిందితుడు.. పార్టీ ప్రధాన వేడుకకు రావడం కలకలం రేపింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications