Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
హైదరాబాద్: శంషాబాద్లో డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

మానవ మృగాల బారిన పడి..
మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయిందని అన్నారు. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. డా. ప్రియాంక రెడ్డి కుటుంబానికి తన తరపున, జన సైనికుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామన్నారు.

ఆచరణలో లేదు..
‘యత్ర నార్యేస్తూ పూజ్యంతే.. రమాంతే తత్ర దేవతా.. ' అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు. ఇప్పుడు శంషాబాద్ ఘటన అనే కాదు.. కొద్ది రోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుర్మార్గుడు చిదివేశాడు. మొన్నటికి మొన్న వరంగల్లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

బహిరంగంగా శిక్షించాలి..
‘నిర్భయ చట్టం తెచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికి ఎలాంటి బెదురూ రావడం లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠిన రీతిలో శిక్షించాలి. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయి' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ సూచనలు
‘పోలీసు శాఖ సైతం షీ టీమ్స్ను మరింత బలోపేతం చేయాలి. శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలి. విద్యార్థినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి' అని పవన్ కళ్యాణ్ సూచించారు. బుధవారం రాత్రి ప్రియాంక రెడ్డిని నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి శంషాబాద్లో సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణ హత్యకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications