Zomato: జొమాటో గోదాములో దారుణ పరిస్థితులు..!
హైదరాబాద్ కూకట్పల్లిలోని జొమాటో యాజమాన్యంలోని గోదాముపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్టోబర్ 29న దాడి చేశారు. గోదాములో ఉల్లంఘనలను గుర్తించారు. అధికారులు 18 కిలోల ముందస్తు పుట్టగొడుగుల ప్యాకేజీలను కనుగొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సరిగాలేని ప్యాకేజింగ్ పద్ధతులు, పరిశుభ్రమైన పద్ధతులకు కట్టుబడి ఉండకపోవడాన్ని గుర్తించారు. ఇందులో ఐటమ్స్ ను హోటల్స్, రెస్టారెంట్లు, క్యాటరర్స్ (HoReCa) పరిశ్రమ కోసం సరఫరా చేస్తారు.
ఈ గోదాము నుంచి పండ్లు, కూరగాయలు, మాంసం, సీఫుడ్, గౌర్మెట్ ఫుడ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, వినియోగ వస్తువులు, కిచెన్ పరికరాలతో సహా అనేక రకాల అవసరమైన వంటగది సామాగ్రిని సరఫరా చేస్తారు. గిడ్డంగి అస్తవ్యస్తంగా, అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నట్లు సోదాల్లో తేలింది. మురికి నిల్వ రాక్లు, ఆహార భద్రత శిక్షణార్థులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. గ్లౌజ్ లు లేకుండా, తలపాగా, అప్రాన్ వంటి అవసరమైన రక్షణ కవచాలు లేకుండా అక్కడ పనిచేస్తున్నవారు కనిపించారు.

మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవని, వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని దర్యాప్తులో వెల్లడైంది. ఆహార ఉత్పత్తులతో పాటు సౌందర్య సాధనాలు సరిగ్గా నిల్వ చేయాలేదని తేలింది. దీంతో గోదాము నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అధిక భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని జొమాటో తెలిపింది. గుర్తించిన సమస్యలను సరిచేయడానికి తమ గిడ్డంగి భాగస్వామితో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది.
అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పలు హోటల్లు, రెస్టారెంట్లలో దాడులు చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు, ప్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్ కనిపించింది. తుప్పుపట్టిన రిఫ్రిజిరేటర్ లో చికెన్, మటన్ నిల్వ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే కిచెన్ లో ఓపెన్ డ్రైనేజీ ఉంది. సోమవారం రేష్మ బేగం అనే మహిళ ఫుడ్ పాయిజన్ తో మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం సృష్టించింది
జీహెచ్ఎంసీ అధికారులు చింతల్ బస్తీలోని మోమోస్ తయారు సేంటర్ లో దాడులు చేశారు. అక్కడ దారుణ పరిస్థితులు గుర్తించి వెంటనే కిచెన్ ను సీజ్ చేశారు. దీంతో జనాలు బయట తినాలంటేనే భయపడిపోతున్నారు. జొమాటో ద్వారా కూరగాయలు తెప్పించుకుందామనుకుంటే.. కూడా సరైన ప్రమాణాలు పడించడం లేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications