రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే ఉద్యమిస్తాం: వినోద్ కుమార్, వినయ్ భాస్కర్
వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు రైల్ నిలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట వ్యాగన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించాలన్నారు. రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కకేంద్రం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని మండిపడ్డారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంఘీభావం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర కేబినెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్ లు, ప్రాజెక్ట్ లు ఇస్తున్నారని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ లో తెలంగాణ కు అన్యాయం జరిగితే బీజేపీ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు.
Recommended Video
రైల్వే బడ్జెట్ను కేంద్రం విస్మరించింది. రైల్వేను అంబానీ, అదానీలకు అప్పగించింది. దీని వల్ల లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాల్లో అవకాశం ఉండదు. ఏడేళ్లుగా ఇదే విషయంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications