పట్టాలు తప్పిన రాణిఖేత్ ఎక్స్ ప్రెస్, పక్కకి ఒరిగిన 10 బోగీలు
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో రాణిఖేత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాజస్థాన్: రాజస్థాన్ లోని జైసల్మేర్ లో రాణిఖేత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 బోగీలు పక్కకి ఒరిగాయి.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే థాయాట్ హమీరా ప్రాంతంలో ఇది జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందగానే రైల్వే సీనియర్ అధికారుల బృందం ప్రమాద స్థలికి చేరుకొని విచారణ ప్రారంభించింది.
పట్టాల వద్దనే ఏదో సమస్య ఏర్పడి ఉంటుందని, అదే బోగీలు పట్టాలు తప్పడానికి కారణమై ఉంటుందని అధికారులు తమ ప్రాథమిక పరిశీలనలో నిర్ధారించారు. పట్టాలు తొలగిన కంపార్ట్ మెంట్ల లోని ప్రయాణికులను వెంటనే మరో ప్రత్యేక రైలులో వారి గమ్య స్థానాలకు తరలించారు.