గ్రెనెడ్లతో విరుచుకుపడిన ఉగ్రవాదులు: 12 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బుధవారం ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడటంతో 12 మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
పుల్వామాలోని కకపురా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనెడ్లతో దాడులకు పాల్పడ్డారని, అయితే, అది తప్పిపోయి రోడ్డుపై పేలిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఎవరూ కూడా గాయాలపాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే పాక్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ముగ్గురు భారత సైనికులు, ముగ్గురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేసింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద ఆయుధ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తేలికపాటి క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 8-10 వరకు పాక్ సైనికులు, ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications