బావిలో పడిన 2 ఏనుగుల కోసం120 ఏనుగులొచ్చాయి!
మిడ్నపూర్ :ఓ మనిషి రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే చూస్తూ మన దారిన మనం పోతుంటాం. కాని, నోరు లేని మూగ జీవాల...తమతో ఉన్న 2 జంతువులు ప్రమాదానికి గురయ్యాయని తెలిసి వాటికి రక్షణ కల్పించేందుకు వచ్చాయి.వింత గొలిపే ఈ ఘటన పశ్చిమబంగా రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పశ్చిమబంగా రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో అడవిలో నుండి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి.వాటిని రక్షించేందుకుగాను 120 ఏనుగులు బావివద్దకు వచ్చి రక్షణ కల్పిస్తున్నాయి.ఈ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలోని ఓ బావిలో రాత్రి 8 గంటలకు రెండు ఏనుగులు ప్రమాదశాత్తు బావిలో పడిపోయాయి.ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన ఏనుగులు అడవి నుండి బావి వద్దకు చేరుకొన్నాయి.బావి వద్ద రక్షణ వలయాన్ని ఏర్పరచాయి.

అడవి నుండి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు ప్రసవించింది.ఇది కూడ ఏనుగుల గుంపు అక్కడే ఉండేందుకు కారణమైంది. బావిలో పడిన ఏనుగులను వెలికితీసేందుకు అటవీశాకాధికారులకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసే అవకాశం ుందని అధికారులు గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు.దరిమిలా వారు సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.ఈ ఏనుగుల గుంపును అడవి ప్రాంతానికి తరిమివేస్తేనే బావిలో పడిన ఏనుగులను సురక్షితంగా తీసే అవకాశం ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications