మా రక్తం మరిగిపోతోంది
PM Modi's Mann Ki Baat: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ ఉదంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు గుర్తు చేసుకున్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఇది 121వ ఎపిసోడ్. పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహిస్తుందనుకుంటే పొరపాటు పడ్డట్టేనని, దీన్ని తుంచివేస్తామని భావోద్వేగంతో ప్రకటించారు.

ఎన్నో సంవత్సరాల తరువాత జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం ఇప్పుడిప్పుడే నెలకొంటోందని, కాశ్మీరీల రోజువారీ జీవనం కుదుటపడుతోందని అన్నారు. ఉగ్రవాదాన్ని విస్మరించేలా అక్కడ పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి జమ్మూ కాశ్మీర్ పునరంకితమౌతోందని చెప్పారు.
అది- శతృమూకలకు నచ్చలేదని, ఉగ్రవాదులు, వాళ్లను పోషిస్తోన్న యజమానులు.. కాశ్మీర్ వినాశనాన్ని కోరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. అక్కడి ప్రజలు అభివృద్ధి బాట పట్టడాన్ని సహించలేకపోయారని పేర్కొన్నారు. అందుకే- ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు.
ఉగ్రవాదంపై జరిగే ఈ యుద్ధంలో- దేశ ఐక్యతే మన అతిపెద్ద బలం అని మోదీ చెప్పారు. ఈ సవాలును ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని హృదయ విదారకంగా మార్చిందని, మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోన్నారని అన్నారు.
ప్రపంచ నాయకులు తనకు ఫోన్ చేశారు.. లేఖలు రాశారు.. సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 1.4 బిలియన్ల భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తోంది. బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇస్తున్నా..అని మోదీ అన్నారు.
ఈ దాడికి పాల్పడిన కుట్రదారులు, నేరస్థులు అత్యంత కఠినమైన భారత ప్రతిస్పందనను చవి చూస్తారు.. అని మోదీ హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో కన్నుమూసిన వాళ్లు, వారి కుటుంబ సభ్యలు కన్నీరు పెట్టుకునే ఫొటోలు, వీడియోలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని వ్యాఖ్యానించారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications