లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి (ఫోటోలు)
చెన్నై: తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లాలో మేలుమలై సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. వీరంతా కూడా బెరగాయ్ నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కర్ణాటక నుంచి వేరుశెనగ లోడుతో వస్తున్న లారీ ఐదో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపు తప్పింది.
అదుపు తప్పిన లారీ ముందుగా బస్సును ఢీకొట్టి ఆ తర్వాత ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలతో పాటు 12 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. కాగా మృతుల వివరాలతో పాటు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి
తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లాలో మేలుమలై సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు.
లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి
వీరంతా కూడా బెరగాయ్ నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కర్ణాటక నుంచి వేరుశెనగ లోడుతో వస్తున్న లారీ ఐదో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపు తప్పింది.
లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి
అదుపు తప్పిన లారీ ముందుగా బస్సును ఢీకొట్టి ఆ తర్వాత ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
లారీ-బస్సు ఢీ: అక్కడికక్కడే 15 మంది మృతి
మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలతో పాటు 12 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. కాగా మృతుల వివరాలతో పాటు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.