ఇద్దరికీ గాయాలు, నలుగురు బీజేపీ కార్యకర్తలకు కూడా.. టీఎంసీ, బీజేపీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పుర్బా మెదినిపూర్ జిల్లా సస్తాతమల్ నియోజకవర్గంలో ఘర్షణ జరిగింది. ఇక్కడ అధికార టీఎంసీ పార్టీ బీజేపీపై ఆరోపణలు చేసింది. పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. మెదినిపూర్ ఇతర చోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో తోపులాట జరిగగా.. భద్రతా బలగాలు కాల్పులు జరిపారు.
కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సమస్తితమల్, భాగ్వాన్ పూర్ నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఇటు బీజేపీ మాత్రం టీఎంసీపై ఆరోపణలు చేస్తోంది. ఆర్గొల్ పంచాయతీలో టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. బూత్ నంబర్ 178 వద్ద తమపై దాడి చేశారని ఉత్తర్ కంతి బీజేపీ కార్యకర్త ఒకరు తెలిపారు. మరో నలుగురు కూడా గాయపడ్డారని వివరించారు.

ఓటింగ్ ప్రక్రియను నిలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. పాసిమ్ మెడినిపుర్ బూత్ నంబర్ 167 వద్ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. సీఆర్పీఎఫ్ బలగాలతో బీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications