కారులో హోటల్కు ఎత్తుకెళ్లి గర్ల్పై సోదరుడు, ఫ్రెండ్స్ రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఫరీదాబాద్లో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతి పైన ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఓ వ్యక్తి బాధితురాలికి స్వయంగా సోదరుడు (కజిన్) కావడం గమనార్హం.
భల్లాభ్గర్లోని ఆర్య నగర్కు చెందిన సదరు యువతి మార్కెట్కని ఇంటి నుంచి బయటకు రాగా అక్కడే కాపు కాసిన ఆమె కజిన్ భూపేంద్ర కూల్డ్రింక్ తాగుదాం రమ్మంటూ పిలిచాడు. అయతే అందుకు స్పందించని యువతి ముందుకెళ్లగా.. మరింత బలవంతపెట్టడంతో కాదనలేక అతడిచ్చిన కూల్ డ్రింక్ తాగింది.

కూల్ డ్రింక్ తాగిన ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. సొమ్మసిల్లి పడిపోయిన ఆమెను భూపేంద్ర కారులో వేసుకుని సమీపంలోని ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడే అతని స్నేహితులు ఇద్దరు.. మోతి, దీపు ఉన్నారు. వారిద్దరితో కలిసి భూపేందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications