టెక్కీపై అత్యాచారం, హత్య: ముగ్గురు దోషులే, రేపు శిక్ష ఖరారు
2009లో జరిగిన పుణే మహిళా టెక్కీ హత్య కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
పుణే: 2009లో జరిగిన పుణే మహిళా టెక్కీ హత్య కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
సుమారు ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళా టెక్కీ నయనా(28) పైన సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు ముగ్గురిని దోషులుగా తేల్చుతూ స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ తీర్పునిచ్చారు.

ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, తదితర నేరాల కింద మోపిన కేసులు నిరూపితమయ్యాయి. అయితే, ఈ ముగ్గురు దోషులకు ఏ శిక్ష విధించాలన్నది కోర్టు బుధవారం నిర్ణయించనుంది.
కేసు విషయానికి వస్తే పూణె-అహ్మద్ నగర్ స్టేట్ హైవేపై ఉన్న ఖరాడి ప్రాంతంలోని ఓ ఐటీ సంస్థలో నయనా సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేసేది. 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సమయంలో కిడ్నాప్కు గురైంది.
రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖఏడ్ తహసీల్లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో పూజూరి మృతదేహం బయపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి అడవిలో పడేసి పరారయ్యారు. ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డు, డబ్బులు తీసుకుని పారిపోయారు.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications