భారత్ లో జనవరి 26 న ఉగ్ర దాడులకు కుట్ర..?
తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో "26-26" అని అసాధారణ సంకేత సందేశాలు కలకలం రేపుతున్నాయి. అయితే పలు నివేదికల ప్రకారం.. వీటిని జనవరి 26, 2026 గణతంత్ర దినోత్సవానికి సంకేతంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. దిల్లీతో పాటు అయోధ్యలోని రామ మందిరం వంటి దేశవ్యాప్త ప్రధాన ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేసి, నిఘా ఏజెన్సీలను హై అలర్ట్ చేశారు.
ఈ అలర్ట్ లు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల నుండి అందినట్లు స్పష్టం అవుతోంది. ఆన్ లైన్ సంభాషణల తీరును బట్టి.. ఇవి విడివిడిగా కాకుండా సమన్వయంతో కూడిన కార్యకలాపంగా ఏజెన్సీలు భావిస్తున్నాయి. భద్రతా ప్రణాళిక దారులు ఈ సందేశాల వెనుక ఉన్న డిజిటల్ ఆధారాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు.
జైష్- ఎ- మొహమ్మద్, లష్కర్- ఎ- తోయిబా సీనియర్ కమాండర్ల రెచ్చగొట్టే ప్రసంగాల నేపథ్యంలో ఈ విశ్లేషణ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మిలిటెంట్ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి ప్రతీకారంగా ఈ ప్రసంగాలు ఉన్నాయని గుర్తించారు. ఈ పరిణామాలు ఉగ్రవాదుల సమన్వయ ప్రయత్నాలకు సంకేతంగా నిలుస్తున్నాయి.
తాజా నిఘా నివేదికల ప్రకారం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని పలు సంస్థలు, ISI మద్దతుతో, భారతీయ కీలక నగరాలపై, ముఖ్యంగా దిల్లీ లక్ష్యంగా.. సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రూపులకు పంజాబ్ నుండి పనిచేస్తున్న గ్యాంగ్ స్టర్లతో కార్యాచరణ సంబంధాలు కూడా ఉన్నాయని సమాచారం.

మరోవైపు ఫాల్కన్ స్క్వాడ్ కాశ్మీరీ నిరోధక బృందం హెచ్చరిక జారీ చేసింది. చిర్ప్ వైర్ ప్లాట్ ఫామ్ లోని 'కాశ్మీర్ ఫైట్స్ ఫాల్కన్ ఎక్స్' పేజీ ద్వారా వచ్చిన ఈ హెచ్చరికలో, తమ ఆస్తులు జప్తు చేస్తే "తీవ్ర పరిణామాలు" ఉంటాయని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడికి స్పష్టమైన ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. జైష్ ఏజెంట్లు నడుపుతున్న "ఇస్లా- ఎ -ఉమ్మత్" ఖాతా యువతను ఆకర్షించి, ప్రముఖులు, సున్నిత సంస్థాపనలపై దాడులకు ప్రేరేపిస్తోంది. "26- 26" సందేశం ఈ ముప్పులను ప్రతిబింబిస్తుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఆఫ్ఘన్, బలూచ్ కార్యకలాపాలకు భారత మద్దతుకు ఇది ప్రతీకారమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications