2జీ స్కాంలో తీర్పు ఎఫెక్ట్: జోరందుకున్న సన్ టీవీ షేర్లు
చెన్నై: 2జీ కోర్టు తీర్పు నేపథ్యంలో సన్ టీవీ షేర్లు జోరందుకున్నాయి. ఇప్పటికే 5 శాతానికి పైగాపెరిగాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ స్కాం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి నిర్దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
Recommended Video
ఆసక్తికరం: లాయర్నే పెట్టుకోని రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి చెప్పలేక రాశాడు!
వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్ టీవీ తదితర సంస్థల షేర్ల విలువ పెరిగింది. డీబీ రియాలిటీ (19.94%), సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ (5.03% ) యూనిటెక్ (15.82%).