అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం: కారుపై బుల్లెట్ల వర్షం: టోల్ప్లాజా వద్ద నాలుగు రౌండ్లు కాల్పులు
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

వాడివేడిగా..
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్ను హస్తగతం చేసుకోవడంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. విస్తృతంగా ప్రచార కార్యక్ర

బీజేపీ టార్గెట్..
బీజేపీ దూకుడును నిలువరించడానికి అన్ని ప్రధాన ప్రతిపక్షాలు ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. పంజాబ్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తన అధికార పరిధిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసుకోవడానికి ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే- ఢిల్లీని రోల్ మోడల్గా తీసుకుని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. పంజాబ్, గోవాలపై ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది.

అసదుద్దీన్ కారుపై కాల్పులు..
ఈ పరిణామాల మధ్య ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారు టైర్లు పేలిపోయాయి. అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు.

మీరట్ సమీపంలో
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అసదుద్దీన్ ఒవైసీ.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి వివరించారు. అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ఇవ్వాళ ఆయన మీరట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కితౌర్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది.

కారుపై బుల్లెట్ తగిలిన గుర్తులు..
టోల్ ప్లాజా వద్ద కారు స్లో అయిన సమయంలో ముగ్గురు నుంచి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కారు ఎడమ వైపు ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్కు బుల్లెట్లు తాకాయి. ఆ గుర్తులను కూడా అసదుద్దీన్ ఒవైసీ మీడియా ప్రతినిధులకు చూపించారు. బుల్లెట్లు తగిలి కారు టైర్లు పేలిపోయాయని చెప్పారు. తాను మరో కారులో ఢిల్లీకి బయలుదేరానని ఆయన వివరించారు.

తీవ్ర ఉద్రిక్తత..
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించినట్టయింది. తనపై కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
Recommended Video
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications