పూరీ జగన్నాథుడి రథయాత్ర తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు దుర్మరణం
అత్యంత వైభవంగా కొనసాగుతున్న పూరీ జగన్నాథుడి రథయాత్రలో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేురుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ తెల్లవారు జామున పూరీలోని గుండిచా ఆలయానికి సమీపంలో గల శారదబలి వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత మొహంతిగా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా ఖుర్దా జిల్లాకు చెందిన భక్తులు. జగన్నాథుడి రథయాత్రను తిలకించడానికి తొలి రోజే పూరీకి చేరుకున్నారు.

ఈ తెల్లవారు జామున 4:20 నిమిషాల ప్రాంతంలో జగన్నాథుడు తన తోబుట్టువులతో కొలువుదీరిన సమయంలో దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడటం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఈ ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, పోస్టుమార్టం కోసం పంపామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ తెలిపారు.
స్వామివారికి అలంకరించాల్సిన చరమాలతో కూడిన రెండు ట్రక్కులు శారదబలి ఆలయానికి సమీపించినప్పుడు తొక్కిసలాటు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చరమాలను జగన్నాథుడికి అలంకరించడాన్ని తిలకించాలనే ఉద్దేశంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారని చెబుతున్నారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మోహన్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రథయాత్ర ప్రారంభంలో జాప్యం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది. బిజూ జనతాదళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జాప్యం గందరగోళానికి దారి తీసిందని పేర్కొన్నారు.
Puri Stampede | Odisha Law Minister Prithiviraj Harichandan confirms three deaths and six to seven injured
— ANI (@ANI) June 29, 2025
Speaking to ANI over the phone, Odisha Law Minister Prithiviraj Harichandan said, "It is an unfortunate incident. We are taking note of that. I spoke with the CM this… pic.twitter.com/unE8osPw9C
భక్తులను క్రమబద్దీకరించడానికి ఒడిశా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించినప్పటికీ- ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి- శారదబలి వంటి కీలకమైన పాయింట్ల వద్ద భక్తులను నియంత్రించడంలో సిబ్బంది విఫలం అయ్యారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications