నిబంధనల ఉల్లంఘన: బ్రిటన్లో 38 మంది భారతీయుల నిర్బంధం
38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు క
న్యూఢిల్లీ/లండన్: 38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు కూడా అరెస్టు అయ్యాడు.
లీచెస్టర్ నగరంలోని రెండు వస్త్ర కర్మాగారాలపై ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం గతవారం దాడులు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే కొనసాగుతున్నారని గుర్తించారు అధికారులు.

అంతేగాక, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగం చేస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ స్థానిక 'లీచెస్టర్ మెర్క్యూరీ' పత్రిక వెల్లడించింది.
కాగా, వీరిని ఉద్యోగులుగా చేర్చుకున్న రెండు కంపెనీలైన ఎంకే క్లాతింగ్ లిమిటెడ్, ఫ్యాషన్ టైమ్స్ యూకే లిమిటెడ్ పైనా భారీ జరిమానాలను విధించే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications