ఐఎస్లో చేరడానికి వెళ్తున్న 4గురు యువకుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తున్న నలుగురు భారతీయ యువకులను సిరియాలో గుర్తించి, నిర్బంధించినట్లు ఆ దేశ ఉప ప్రధానమంత్రి వాలిద్ అల్ మౌలెమ్ బుధవారం వెల్లడించారు. వారి పేర్లు, భారత్లో ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు సిరియాలో పట్టుబడ్డారు అనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.
భారత్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన మౌలెమ్ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్కు చెందిన నలుగురు యువకులు జోర్డాన్ మీదుగా సిరియాలో అడుగుపెట్టారనీ, వారిని డెమాస్కస్లో అరెస్టు చేశామనీ చెప్పారు. అయితే వారు భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.

ఇరాక్లోని మోసుల్ నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బందీలైన 39 మంది భారతీయుల్ని విడిపించే విషయంలో తానెలాంటి సాయం అందించలేనని మౌలెమ్ అశక్తత వ్యక్తం చేశారు. కాగా, ఆ 39మంది భారతీయులను జూన్ 2014లో ఉగ్రవాదులు తమ బందీలుగా చేసుకున్నారు.
వారు ఇరాకీ భద్రతా దళాల అదుపులో ఉంటే విడిపించగలం కానీ, ఉగ్రవాదుల చెరలో ఉంటే మాత్రం ఏమీ చేయలేమని ఆయన తెలిపారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడం, ఆర్థిక సాయం అందజేత విషయాల్లో భారత్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమయిందని మోసుల్ తెలిపారు. తమపై అమెరికా సహా కొన్ని దేశాలు ఏకపక్షంగా ఆంక్షలు విధించాయనీ వివరించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications