మావోయిస్టుల ఘాతుకం: వాహనాన్ని పేల్చడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న తరుణంలో భద్రతా దళాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు.

ఈ ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన అనంతరం మరిన్ని బలగాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
కాగా, నవంబరులో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నవంబరు 12న పోలింగ్ జరగనుంది. మిగిలిన ప్రాంతాల్లో నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, రాజస్థాన్తో పాటు డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications