బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ డిటోనేటర్ పేలి ఐదు మంది శాస్త్రవేత్తలకు!
బెంగళూరు: బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిటోనేటర్ పేలడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయి. డిటోనేటర్ పేలడంతో గాయాలైన ఐదు మంది అధికారులకు చికిత్స చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లు పరిశీలిస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో శుక్రవారం స్వాధీనం చేసుకున్న 9 డిటోనేటర్లు పరిశీలిస్తున్ననారు. ఆ సమయంలో ఓ డిటోనేటర్ ఆకస్మికంగా పేలిపోవడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయని తెలిసింది.

వెంటనే గాయపడిన శాస్త్రవేత్తలను సమీపంలోని ప్రైవేటు ఆసుతప్రికి తరలించామని డీసీపీ ఈషాపంత్, తదితర అధికారులు చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను పరిశీలించి వివరాలు తెలుసుకోవడానికి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకువచ్చామని అధికారులు అంటున్నారు.
విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల వివిద కేసుల్లో పోలీసులు అనేక పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications