అత్యాచారం, గుజరాత్లో ప్రాంతీయ చిచ్చు: వలస కార్మికులపై దాడులు
న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, లేబర్లు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వచ్చిన వారు వెళ్లిపోతున్నారు. ఇటీవల బీహార్కు చెందిన ఓ వ్యక్తి 14 నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గుజరాతీయులు దాడి చేశారు.
ఉత్తర భారతీయ వికాస్ పరిషత్ (మైగ్రాంట్ వర్కర్స్కు చెందిన అనుబంధ సంస్థ) శ్యామ్ సింహ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తమకు ఆదివారం రోజు 700 బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. యూపీ, బీహార్తో పాటు ఉత్తర భారతానికి చెందిన దాదాపు 50వేల మంది గుజరాత్ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పారు.

చిన్నారిపై అత్యాచారం నేపథ్యంలో గుజరాతీయేతరులు లక్ష్యంగా దాడులు మొదలయ్యాయన్న ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో గుజరాత్లో రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు.
స్థానికేతరులపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో దాదాపు 340 మందికి పైగా అరెస్టు చేశారు. గత నెల 28వ తేదీన సాబర్ కాంఠా, గాంధీ నగర్, అహ్మదబాద్, పటన్, మెహనస జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో అత్యాచారం ఘటన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో యూపీ, బీహార్ నుంచి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన ఎంతోమంది కార్మికులు గుజరాత్ను వదిలి వెళ్తున్నారు.
అయితే, దసరా, దీపావళి సందర్భాలలో ఇలా కూలీలు సొంత ఊర్లకు వెళ్లడం మామూలేనని, దాడులు కారణం కాదని పోలీసులు చెబుతున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications