సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి: ఆరుగురి అరెస్టు
ముంబై: అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై సోమవారం సిరాతో దాడి చేసిన వారిలో ఆరుగురు శివసేన కార్యకర్తలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకం ఆ విష్కరణ కార్యక్రమం సోమవారం ముంబై వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ శివసేన పార్టీ శ్రేణులు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు సిరా పోసి బెదిరించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సుధీంద్ర కులకర్ణి మాత్రం తన ముఖంపై పడిన నల్లరంగుతో మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఘటనపై సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆయనపై సిరాతో దాడి చేసిన ఆరుగురు శివసేన కార్యకర్తలను మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ఆరుగురికి బెయిల్ మంజూరైంది.
కాగా, శివసేన కార్యకర్తల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత నడుమ మధ్య ముంబైలో కసూరి పుస్తకాన్ని ఆవిష్కరించారు కులకర్ణి. కులకర్ణిపై శివసేన కార్యకర్తల దాడిని దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు, మేధావులు, మీడియా తీవ్రంగా తప్పుబట్టాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications