భాగస్వాముల్ని హింసిస్తున్నారు!: మగవాళ్ల అంగీకారం

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ మేరకు అధ్యయనం నిర్వహించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) భారత విభాగం అధిపతి ఫ్రెడరికా మీజర్ తెలిపారు. బాలుర స్థాయి నుంచి పురుషులదాకా లైంగిక సమానత్వంపై అవగాహన పెంచే పటిష్ఠ కార్యక్రమాల రూపకల్పనే దీని లక్ష్యమన్నారు.
సోమవారం విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం... పురుషులనుంచి అభిప్రాయాలు సేకరించారు. బెదిరింపులు, తోయడం, అవమానం, ఎద్దేవా, కొట్టడం, అత్యాచారం వంటి శారీరక - లైంగిక దుశ్చర్యలకు పాల్పడటాన్ని వారు హింసగా పేర్కొన్నారు. భార్యను ఉద్యోగం చేయనివ్వకపోవడం లేదా ఆమె సంపాదనను లాక్కోవడం కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
మహిళలను కూడా దీనిపై ప్రశ్నించగా, వారిలో 52 శాతం చిన్నతనం నుంచీ వైవాహిక జీవితం దాకా గడచిన కాలంలో ఎప్పుడో ఒకప్పుడు హింసకు గురైనట్లు చెప్పారు. వీరిలో 38 శాతం తమ భర్త లేదా కుటుంబంలోని మగవారి చేతిలో బాధలుపడినట్లు వివరించారు.
కాగా, ఈ సర్వేలో తొమ్మిదివేల మందికి పైగా మగవారు, మూడువేల మందికి పైగా ఆడవారు పాల్గొన్నారు. వారు 18-49 ఏల్ల వయసు మధ్య ఉన్నారు.
ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ స్థాయిలో ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 70 శాతానికి పైగా హింసను మహిళలు ఎదుర్కొంటున్నారు. కాగా, మహిళలను హింసిస్తున్న పురుషులలో చిన్నతనంలో వివక్షకు గురైన లేదా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నవారుగా అధ్యయన నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications