విషాదం: జార్ఖండ్లో ఢిల్లీ తరహా ఘటన.. సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం
ఢిల్లీలో బురారీ ప్రాంతంలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యల ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యహత్యకు పాల్పడ్డ వారిని దీపక్ ఝా , అతని భార్య సోనీ ఝా, కుమారులు రూపేష్ ఝా, కుతురు దృష్టి, చిన్న కుమారుడు గంజులుగా పోలీసులు గుర్తించారు. దీపక్ ఝా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం బీహార్లోని భగల్పూర్ నుంచి వలస వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు.

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం జార్ఖండ్ రాష్ట్రంలో ఇది రెండో సారి. అంతకుముందు ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జార్ఖండ్లో జరిగిన రెండు ఘటనలు ఢిల్లీ బురారీ ఆత్మహత్య కేసుతో పోలిఉన్నాయని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో లలిత్ భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడగా... 10 మంది ఒకే చోటు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భాటియా తల్లి నారాయణదేవి మాత్రం మరో గదిలో మృతిచెందింది. తాజాగా రెండు ఘటనల్లో కూడా ఇదే కనిపించింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications