విషాదం: జార్ఖండ్లో ఢిల్లీ తరహా ఘటన.. సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం
ఢిల్లీలో బురారీ ప్రాంతంలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యల ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యహత్యకు పాల్పడ్డ వారిని దీపక్ ఝా , అతని భార్య సోనీ ఝా, కుమారులు రూపేష్ ఝా, కుతురు దృష్టి, చిన్న కుమారుడు గంజులుగా పోలీసులు గుర్తించారు. దీపక్ ఝా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం బీహార్లోని భగల్పూర్ నుంచి వలస వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు.

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం జార్ఖండ్ రాష్ట్రంలో ఇది రెండో సారి. అంతకుముందు ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జార్ఖండ్లో జరిగిన రెండు ఘటనలు ఢిల్లీ బురారీ ఆత్మహత్య కేసుతో పోలిఉన్నాయని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో లలిత్ భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడగా... 10 మంది ఒకే చోటు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భాటియా తల్లి నారాయణదేవి మాత్రం మరో గదిలో మృతిచెందింది. తాజాగా రెండు ఘటనల్లో కూడా ఇదే కనిపించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications