79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత్ సిద్ధమైంది. ఆగష్టు 15వ తేదీన ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం థీమ్గా "నయా భారత్"ను కేంద్రం ప్రకటించింది.ఈ థీమ్, 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో, సంపన్నమైన, సురక్షితమైన, స్వావలంబన గల దేశాన్ని నిర్మించాలనే భారతదేశ ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది.
ఆగష్టు 15వ తేదీన ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తారు.అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది ఈ గొప్ప వేడుకను భారత వాయుసేన ఆధ్వర్యంలో జరుగుతుంది.సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్,గాల్లోకి 21 గన్ సెల్యూట్, జాతీయ జెండాతో పాటు ఆపరేషన్ సింధూర్ జెండాను మోసుకెళుతూ ప్రత్యేక ఫ్లై పాస్ట్ చేస్తుంది. ఈ సారి వేడుకలకు దాదాపుగా 5000 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే స్వాతంత్య్ర వేడుకల మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
Aug 15, 2025, 10:02 am IST
ఢిల్లీ
సుదర్శన్ చక్ర పేరుతో భారీ మిషన్ ను ప్రకటించిన ప్రధాని మోదీ. 2035 నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది. శత్రువుల నుండి దేశాన్ని సమర్థవంతంగా రక్షించేందుకు, అత్యంత ఖచ్చితత్వంతో ప్రతిదాడి చేయడానికి రూపొందించిన అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థలకు సంబంధించిన మిషన్ ఇది.
Aug 15, 2025, 9:29 am IST
ఢిల్లీ
ఈ పథకం కింద- ప్రైవేటు రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క యువతకు కేంద్రం 15,000 రూపాయలను అందజేస్తుంది. సుమారు 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
Aug 15, 2025, 8:59 am IST
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఓ భారీ పథకాన్ని ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజనను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Aug 15, 2025, 8:41 am IST
ఢిల్లీ
త్వరలో సరికొత్త జీఎస్టీ వ్యవస్థను అమలు చేయబోతోన్నాం. జీఎస్టీలో భారీ సంస్కరణలను అమలు చేయబోతోన్నాం. దీనివల్ల పన్నుల భారం తగ్గుతుంది- ప్రధాని మోదీ
Aug 15, 2025, 8:30 am IST
ఢిల్లీ
సింధు నదీ జలాల ఒప్పందం ఎంత అన్యాయమైనదో.. ఏకపక్షమైనదో దేశ ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. భారత్లో పుట్టిన నదుల నీరు మన శత్రువుల పొలాలను సాగు చేస్తుండగా.. సొంత దేశ రైతులు, భూమి నీరు లేక దాహంతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Aug 15, 2025, 8:13 am IST
ఢిల్లీ
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మారణకాండకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్య దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ఆగ్రహాన్ని ఆపరేషన్ సింధూర్ రూపంలో వ్యక్తీకరించాం- ప్రధాని మోదీ
Aug 15, 2025, 7:54 am IST
ఢిల్లీ
తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని చెప్పారు.
Aug 15, 2025, 7:46 am IST
ఢిల్లీ
జాతీయ పతకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ప్రధాని మోదీ. అసేతు హిమాచలం.. వందేమాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. రైతులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల ప్రజలు అచంచల భక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మమేకం అయ్యారని చెప్పారు.
Aug 15, 2025, 7:37 am IST
ఢిల్లీ
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే రెడ్ ఫోర్ట్ వద్దకు చేరుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఇంకొన్ని క్షణాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
Aug 15, 2025, 7:15 am IST
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Aug 15, 2025, 7:07 am IST
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. జైహింద్, జై భారత్ అని నినదించారు.
स्वतंत्रता दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। जय हिंद! जय भारत!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Aug 15, 2025, 6:54 am IST
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత భారత్ను నిర్మించడానికి పంద్రాగస్టు వేడుకలు స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Wishing everyone a very happy Independence Day. May this day inspire us to keep working even harder to realise the dreams of our freedom fighters and build a Viksit Bharat. Jai Hind!
స్వాత్రంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 20,000 మంది అదనపు పోలీసులను మోహరింపజేశారు. ఏఐ టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తోన్నారు. రెడ్ ఫోర్ట్ కు వెళ్లే మార్గాల్లో సాధారణ వాహనదారులకు అనుమతించట్లేదు.
6:37 AM, 15 Aug
ఢిల్లీ
స్వాత్రంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 20,000 మంది అదనపు పోలీసులను మోహరింపజేశారు. ఏఐ టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తోన్నారు. రెడ్ ఫోర్ట్ కు వెళ్లే మార్గాల్లో సాధారణ వాహనదారులకు అనుమతించట్లేదు.
6:54 AM, 15 Aug
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత భారత్ను నిర్మించడానికి పంద్రాగస్టు వేడుకలు స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Wishing everyone a very happy Independence Day. May this day inspire us to keep working even harder to realise the dreams of our freedom fighters and build a Viksit Bharat. Jai Hind!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.
7:07 AM, 15 Aug
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. జైహింద్, జై భారత్ అని నినదించారు.
स्वतंत्रता दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। जय हिंद! जय भारत!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు.
7:30 AM, 15 Aug
ఢిల్లీ
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే రెడ్ ఫోర్ట్ వద్దకు చేరుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఇంకొన్ని క్షణాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
7:37 AM, 15 Aug
ఢిల్లీ
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
జాతీయ పతకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ప్రధాని మోదీ. అసేతు హిమాచలం.. వందేమాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. రైతులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల ప్రజలు అచంచల భక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మమేకం అయ్యారని చెప్పారు.
7:54 AM, 15 Aug
ఢిల్లీ
తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని చెప్పారు.
8:13 AM, 15 Aug
ఢిల్లీ
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మారణకాండకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్య దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ఆగ్రహాన్ని ఆపరేషన్ సింధూర్ రూపంలో వ్యక్తీకరించాం- ప్రధాని మోదీ
8:30 AM, 15 Aug
ఢిల్లీ
సింధు నదీ జలాల ఒప్పందం ఎంత అన్యాయమైనదో.. ఏకపక్షమైనదో దేశ ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. భారత్లో పుట్టిన నదుల నీరు మన శత్రువుల పొలాలను సాగు చేస్తుండగా.. సొంత దేశ రైతులు, భూమి నీరు లేక దాహంతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
8:41 AM, 15 Aug
ఢిల్లీ
త్వరలో సరికొత్త జీఎస్టీ వ్యవస్థను అమలు చేయబోతోన్నాం. జీఎస్టీలో భారీ సంస్కరణలను అమలు చేయబోతోన్నాం. దీనివల్ల పన్నుల భారం తగ్గుతుంది- ప్రధాని మోదీ
8:59 AM, 15 Aug
ఢిల్లీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఓ భారీ పథకాన్ని ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజనను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
9:29 AM, 15 Aug
ఢిల్లీ
ఈ పథకం కింద- ప్రైవేటు రంగంలో మొదటిసారిగా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్క యువతకు కేంద్రం 15,000 రూపాయలను అందజేస్తుంది. సుమారు 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
10:02 AM, 15 Aug
ఢిల్లీ
సుదర్శన్ చక్ర పేరుతో భారీ మిషన్ ను ప్రకటించిన ప్రధాని మోదీ. 2035 నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది. శత్రువుల నుండి దేశాన్ని సమర్థవంతంగా రక్షించేందుకు, అత్యంత ఖచ్చితత్వంతో ప్రతిదాడి చేయడానికి రూపొందించిన అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థలకు సంబంధించిన మిషన్ ఇది.