96కి చేరిన స్ట్రెయిన్ కేసులు.. ఇవాళ మరో ఆరుగురికి...
కరోనా స్ట్రెయిన్.. పేరు చెబితేనే జనం భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్లో వెలుగుచూసిన వైరస్.. ఇతర దేశాలకు పాకింది. అయితే భారత్లో ఇలాంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం మరో ఆరు స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. దీంతో స్ట్రెయిన్ కేసుల సంఖ్య 96కి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా స్ట్రెయిన్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నామని వివరించింది. శనివారం స్ట్రెయిన్ కేసులు 90 కాగా.. ఆదివారం ఒక్క కేసు కూడా రాలేదు. అయితే సోమవారం మరో ఆరు కేసులు వచ్చాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు తెలిపారు. స్ట్రెయిన్ మరింత స్ప్రెడ్ కాకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

బ్రిటన్ నుంచి తొలుత విమానాలు నిలిపివేయగా.. ఈ నెల 8వ తేదీ నుంచి కొన్ని ప్లైట్లను మాత్రమే అనుమతించింది. అయితే అక్కడి నుంచి వచ్చేవారికి విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తోంది. ఒకవేళ లక్షణాలు ఉంటే బయటకు పంపించడం లేదు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తోంది. ఇన్నీ నిబంధనలు పెట్టినా.. కఠిన చర్యలు తీసుకున్నా స్ట్రెయిన్ కేసులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు తెలుపగా.. అదీ వ్యాప్తి చెందేదానిని బట్టి నిజమని అర్థమవుతోంది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications