టిక్కెట్ అడిగితే చితకబాది చంపేస్తామని బెదిరించారు, ఆర్ టీసీ మేనేజర్, సిబ్బందిపై ఎఫ్ఐఆర్!
ప్రజలకు రవాణా సేవలను అందించే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అధికారి, సిబ్బంది కలిసి ప్రయాణికుడిపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. టికెట్ ఇవ్వడంపై రచ్చకెక్కిన గొడవ ఇప్పుడు ప్రాణహాని వరకు చేరింది. దీంతో కేఎస్ఆర్ టీసీ మేనేజతో సహ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం కలకలం రేపింది.
రాత్రి చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన రాఘవేంద్ర అనే వ్యాపారి ఊరికి వెళ్లడానికి బెంగళూరులోని మెజెస్టిక్లోని కేఎస్ఆర్టీ బస్ టెర్మినల్కు వచ్చాడు. అక్కడి నుంచి హరిహర వెళ్లే బస్సు ఎక్కిన వ్యాపారి రాఘవేంద్ర హిరియూరికి టిక్కెట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్ టీసీ బస్సులో టికెట్ ఇచ్చే విషయంలో కేఎస్ఆర్ టీసీ సిబ్బంది తన మీద దాడి చేశారని ప్రయాణికుడు రాఘవేంద్ర కేసు పెట్టాడు. ప్రయాణికుడిపై దాడి చేసి చంపుతామని బెదిరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

హిరియూరికి టికెట్ అడగగా ఈ బస్సు హిరియూరికి వెళ్లదని, బైపాస్ మీదుగా వెళ్తుందని కండెక్టర్ రాఘవేంద్రకు చెప్పాడు. బైపాస్లో దిగుతానని చెప్పిన రాఘవేంద్ర టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో కండక్టరు చిత్రదుర్గకు టిక్కెట్టు తీసుకోవాలని బెదిరించాడు. తాను హిరియూరులో దిగుతానని, చిత్రదుర్గ టికెట్ ఎందుకు తీసుకోవాలని ప్రయాణికుడు ప్రశ్నించారు. అందుకు అంగీకరించని ఆ బస్సు కండక్టర్ రాఘవేంద్రను బస్సు నుంచి కిందకు దించేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయిడు..
హిరియూరుకు చిత్రదుర్గకు మధ్య 43 కిలోమీటర్ల దూరంగా ఉంది. హిరియూరులో దిగాల్సిన వారికి పక్క ఊరు టిక్కెట్టు ఎందుకు ఇస్తారు అని రాఘవేంద్రతో పాటు కొందరు ప్రయాణికులు ప్రశ్నించారు. తరువాత విసిగిపోయిన ప్రయాణికుడు రాఘవేంద్ర బస్సు దిగి వెళ్లి కేఎస్ఆర్ టీసీ డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ అదే డైలాగ్ రిపీట్ చేశాడు. హిరియూరికి టిక్కెట్టు లేదు, మీరు చిత్రదుర్గ టిక్కెట్టు తీసుకోవాలి అని రాఘవేంద్రకు తేల్చిచెప్పారు.

ఆసమయంలో రాఘవేంద్ర డిపో మేనేజర్తో సంభాషణను వీడియో చేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న సతీష్ అనే సెక్యూరిటీ గార్డు రాఘవేంద్ర మొబైల్ ఫోన్ లాక్కొని కర్రతో కొట్టి, అతని ఛాతిపైన తన్ని కేఎస్ఆర్ టీసీ డిపోమేనేజర్ రూమ్ రూమ్ లో నుంచి బయటికి ఈడ్చేశాడు. మాపై దాడి చేశారని రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. KSRTC సిబ్బంది నుండి తనకు ప్రాణహాని ఉందని రావేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డిపో మేనేజర్ గదిలోకి లాగిన సిబ్బంది సతీష్, మేనేజర్ తనపై దాడి చేశారని, సతీష్ మాట్లాడుతూ నేను కూడా హిరియూరుకు చెందిన వాడే అని, నా సోదరుడు పెద్ద గూండా అని, నిన్ను హిరియూరులోనే చంపేస్తామని సెక్యూరిటీ గార్డు సతీష్ తనను బెదిరించాడు, తనను చంపేస్తానని బెదిరించాడని రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) మేనేజర్, సిబ్బందిపై బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications