రైతంటే అంత చులకనా..! పలకరించడమే పాపమన్నట్టుగా..
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆసరా లేకుండా అయిపోతుంది. ఏ ప్రభుత్వ పథకాలు అన్నదాతల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. తీవ్ర కరువుతో దేశంలొని రైతులంతా అల్లాడుతున్న వేళ.. పరిస్థితికి అద్దం పడుతూ దేశ రాజధాని ఢిల్లీలో, ప్లకార్డు చేతబట్టిన ఓ రైతు తనకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రోడ్ల వెంబడి కనిపించిన ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాడు.
చిత్రంగా చాలామంది ఆ రైతును చూసీ చూడనట్టుగా వెళ్లిపోయారు తప్పిస్తే.. సహాయం కాదు కదా, కనీసం పలకరించే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. దాదాపుగా 5 గంటల పాటు ఆ రైతు ఢిల్లీ రోడ్ల వెంట తిరిగితే.. అందరూ మాకెందుకు అన్నట్టుగానే రైతును దాటేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ఇండియా గేట్ వద్దనైతే అక్కడున్న పోలీసు బలవంతంగా రైతును అక్కడినుంచి పంపించేసే ప్రయత్నం చేశాడు.

కాగా.. కష్టాల్లో ఉన్న రైతుల పట్ల దేశ ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. కానీ రైతుల పట్ల జనాలు ఎంత చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారో ఈ ప్రయోగంతో తేలిపోయింది. కాలే కడుపులతో గ్రామాల నుంచి వలసబాట పడుతున్న రైతులు కొందరైతే.. ఏదో భరోసా రాకపోదా అని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నవారు గ్రామాల్లో ఎంతోమంది. మరి ఇలాంటి రైతన్నలందరు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో..!
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications