గల్లంతు: అరుణాచల్లో చిక్కిన హెలికాప్టర్
అసోం: వాతావరణంలోని మార్పుల కారణంగా ఒక హెలికాప్టర్ గల్లంతు అయ్యింది. హెలి కాప్టర్ లో ఒక సీనియర్ పోలీసు అధికారితో పాటు ఇద్దరు పైలెట్ ఉన్నారు. మంగళవారం ఉదయం అసోం నుండి బయలుదేరిన హెలికాప్టర్ హిమాచల్ ప్రదేశ్ లో గల్లంతు అయ్యింది. అయితే, సాయంత్రం దాని ఆచూకీ లభ్యమైంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో అది ఉన్నట్లు గుర్తించారు.
మంగళవారం ఉదయం అసోం లోని డిబ్రుగఢ్ ప్రాంతం నుండి పవన్ హన్స్ హెలికాప్టర్ బయలుదేరింది. ఈ హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లోని ఖోన్సా జిల్లాకు బయలుదేరింది. ఉదయం 11 గంటల సమయంలో హెలికాప్టర్ నుండి అధికారులతో సంబంధాలు తెగిపోయాయి.

అప్పటి నుండి గాలించిన అధికారులు చివరికి హిమాచల్ ప్రదేశ్ లో హెలికాప్టర్ గల్లంతు అయ్యిందని గుర్తించారు. వెంటనే రెస్య్కూ సిబ్బందిని రంగంలోకి దించారు. రెస్యూ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు.
హెలికాప్టర్ లో జిల్లా ఎస్పీ కమలేష్ జోషి, ఒక పైలెట్, ఒక కో-పైలెట్ ఉన్నారని అధికారులు తెలిపారు. 2011వ సంవత్సరంలో అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోరిజ్ కండుతో పాటు నలుగురు పవన్ హన్స్ విమానంలో ప్రయాణిస్తు ప్రమాదవశాత్తు కూలిపోవడంతో దుర్మరణం చెందారు.












Click it and Unblock the Notifications