భార్యను కాపురానికి పంపకపోతే బాంబులు పేల్చుకుని చస్తా...! భర్త వింత ఆందోళన
దేశంలో భార్య బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో తమ భర్తలు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళల ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి...కాని కాలం మారింది. ఇప్పుడు భర్తలే, భార్య బాధితులవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే తమ భార్యలను కాపురానికి పంపించాలని భర్తలు అత్తవారి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ భార్య బాధితుడు విచిత్రమైన ఆందోళనకు దిగాడు. తన భార్యను కాపురానికి పంపించండి అంటూ తన ఒళ్లంతా నాటు బాంబులు చుట్టుకున్నాడు. దీంతో పాటు చేతిలో కిరోసిన్ డబ్బా సైతం పట్టుకుని అత్తింటి ముందు బైఠాయించాడు. అల్లుడి ఆందోళనతో భార్య కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకన్న పోలీసులు భార్యభాధితుడికికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.. అయితే ట్విస్ట్ ఏమిటంటే పోలీసుల కౌన్సిలింగ్తో శాంతించిన వ్యక్తి ఈ రెండింటితో పాటు విషం కూడ తాగనని చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడుకు చెందిన మణికందన్ తన భార్యతో గోడవల కారణంగా ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడు. ఆయనకు ఓ కుమారుడు కూడ ఉన్నాడు. ఇక భార్యభర్తల వివాదానికి సంబంధించి కోర్టులో నమోదైన విడాకుల కేసుపై కూడ విచారణ కొనసాగుతోంది. అయితే భార్యతో ఎడబాటును తట్టుకోలేని మణికందన్ అనూహ్యమైన నిర్ణయానికి వచ్చాడు. భార్యను ఎలాగైన కాపురానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అత్తారింటికి చేరాడు. ఇందులో భాగంగానే తన భార్యను కాపురానికి పంపకపోతే తన మెడలో బాంబులు వేసుకుని చచ్చిపోతానంటూ బెదిరించినట్టు తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications