Madhyapradesh: మంటగలిసిన మానవత్వం.. తోపుడు బండిపై బాలుడి మృతదేహం..
మన దేశ ప్రగతి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. కానీ కొన్ని సంఘటనలు చూసినప్పుడు నా దేశం ఈ స్థితిలో ఉందా అని అనిపిస్తుంటుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మానవత్వం మంట గలిసినట్లు నిరూపిస్తుంది. ఓ బాలుడు పాము కాటుకు గురయ్యాడు.
అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు బాలుడి తండ్రు వద్ద డబ్బులు లేవు. అక్కడ ఆస్పత్రిలో అంబులెన్సు అందుబాటులో లేదు.

దీంతో బాలుడి కుటుంబ సభ్యలు బాలుడి మృతదేహాన్ని తోపుడు బండిపై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే తోపుడు బండిపై మృదేహాన్ని తీసుకెళ్తున్నడ్పు ప్రజలు ఆ బండి వెనకాలే వెళ్లారు. కొంత మంది దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అధికారులపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఇంత జరిగినా ఈ ఘటన పై అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ఏడు సంవత్సరాల సాహిల్ ఖాన్ అనే బాలుడిని పాము కాటు వేసింది.
కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వారు అంబులెన్సు కోసం ఎదురు చూశారు.
MP | Shahdol
— काश/if Kakvi (@KashifKakvi) May 16, 2023
लक्षमण सिंह गोंड (आदिवासी) की 13 साल की बेटी माधुरी की सिकल सेल बीमारी से मौत हो गई।
एंबुलेंस मांगने पर अस्पताल में कहा: अनुमति 15 किमी तक की है 70 किमी के लिए अपना इंतज़ाम करो।
प्राइवेट एंबुलेंस बजट में नहीं था तो लक्षमण बेटी का शव बाइक पर लेकर चल पड़े।
1/2 pic.twitter.com/aFDBp4DgLu
అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో తోపుడు బండిపే బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. షోడాల్ లోని ప్రభుత్వ ఆస్పత్రి వారు అంబులెన్సు ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ వ్యక్తి తన 13 ఏళ్ల కూతురు మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు.
ప్రైవేట్ అంబులెన్స్కి డబ్బులు లేకపోవడంతో లక్ష్మణ్సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బైక్పై 70 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. కోట పట్టణానికి చెందిన లక్ష్మణ్, అతని కుమార్తె మాధురి సికిల్ సెల్ ఎనీమియాతో మరణించినట్లు తెలిపారు. ఆసుపత్రి అధికారులను వాహనం కోసం అడిగానని, అయితే 15 కిలోమీటర్లకు మించిన ప్రదేశాలకు అంబులెన్స్ పంపడం లేదని చెప్పినట్లు తెలిపారు. "మేము ఆసుపత్రిలో ఒక శవ వాహనం కోసం అడిగాము, కానీ అది 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ అందుబాటులో ఉండదని వారు చెప్పారు" అని సింగ్ చెప్పారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications