చెన్నై వరదలు: తల్లి శవం పక్కన 20 గంటలు
చెన్నై: చెన్నై నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి అంత్యక్రియలు చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో సహాయం చెయ్యాలని విలపిస్తున్నారు. చెన్నై నగరంలోని అశోక్ నగర ప్రాంతంలో దాదాపు 20 గంటల పాటు ఓ మహిళ ఆమె తల్లి శవం పక్కనే జాగరణ చేశారు.
అశోక్ నగర ప్రాంతంలో డయాలసిస్ చేయించుకుంటున్న 58 సంవత్సరాల మహిళ బుధవారం ఇంటిలోనే మరణించారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. రాత్రి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆమె తల్లి శవం పక్కనే జాగరణ చేశారు.

గురువారం ఉదయం తన స్నేహితులతో ఆమె మొరపెట్టుకున్నారు. తమ అమ్మ నిన్ననే చనిపోయిందని, అంత్యక్రియలు చెయ్యడానికి సహాయం చెయ్యాలని, ఓ వాహనం ఏర్పాటు చేయాలని విలపించింది. ఇప్పటికే దుర్వాసన వస్తున్నదని ఆమె ఆవేదన చెందింది.
ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా వలన ఈ విషయం వెలుగు చూసింది. మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు చోట్ల వైద్యం అందకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.












Click it and Unblock the Notifications