ప్రియురాలు దూరం అయ్యిందని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య, నిశ్చితార్థం!
బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి చెందిన యువకుడు వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్ళి రైల్వేస్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు తెలిపారు.
బయ్యప్పనహళ్లిలోని కార్మల్ రాయ్ ప్రాంతంలో శివమూర్తి (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వర్తురూకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. శివమూర్తి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, అతనికి ఇచ్చి వివాహం చెయ్యడానికి వారు నిరాకరించారని సమాచారం.

ఇటీవల యువతికి వేరు యువకుడికితో నిశ్చితార్థం చేశారు. విషయం తెలుసుకున్న శివమూర్తి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి 11. 30 గంటల సమయంలో శివమూర్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత కార్మల్ రాయ్ ప్రాంతంలో వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివమూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా శివమార్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమూర్తి డెత్ నోట్ రాసిపెట్టాడని, దానిని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని బయ్యప్పనహళ్ళి పోలీసులు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications